బాన్సువాడ నియోజక వర్గం నుంచి టి.ఆర్.ఎస్.పార్టీ నుంచి శాసన సభ్యునిగా గెలవగానే పోచారం శ్రీనివాస రావు కు ఉన్న మతి పోయింది.
సెట్లర్స్ తనకు ఓటు వేయలేదని ,తగిన గుణపాఠం నేర్చుకోవలసి వస్తుందని అనడం అజ్ఞానం,అహంకారం,మూర్ఖత్వం మూర్తీభవించిన ప్రకటన .ఆ మాటకొస్తే,తెలంగాణా లో ఎన్నో తరాలక్రిందనే పుట్టిన వారందరూ అతనికే ఓటు వేసారని నిర్ధారణ ఏమిటి?
అసలు అతని బంధువులు,మిత్రులు,కుటుంబసభ్యులు ఖచ్చితంగా అతనికే ఓటు వేసి ఉంటారా!?
ఒకే రాజకీయ కుటుంబంలో ఉన్నవారు వివిధ పార్టీలలో కొనసాగుతున్నారే!వివిధ సామాజిక వర్గాలు,భిన్న అభిప్రాయాలతో ఉన్న సామాన్య జనం ఒకే పార్టీ కి ఓటు వేస్తారని ఎలా అనుకున్నారు?ఎలా శాసిస్తారు?
అతనితో పోటీ చేసి ఓటు సంపాదించుకున్న వివిధ వ్యక్తులకు పడ్డ ఓట్ల విశ్లేషణ ఎలా చేస్తారు?
రాజ్యాంగ బద్ధుడనై మెలగుతానని ప్రమాణ స్వీకారం చేయడానికి యోగ్యుడెలా అవుతాడు ?
No comments:
Post a Comment